కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం

0
313

కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేసిన శ్రీ ఆంజనేయులు గారిని జీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ గారు శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో ఆంజనేయులు గారు అంకితభావంతో, నిజాయితీగా చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. కోస్గి పట్టణంలో విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శవంతమైన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ఆయన జీవితంలో ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు, అభిమానులు పాల్గొని ఆంజనేయులు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
మున్సిపాల్ కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ...
By Avunoori Mahesh 2026-04-23 14:34:27 0 94
Tripura
Tripura to Set Up Fruit Processing Unit in Dhalai District
To uplift pineapple farmers, the Tripura government plans to establish a fruit-processing...
By Bharat Aawaz 2025-07-17 07:49:55 0 1K
Andhra Pradesh
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-26 11:31:05 0 145
Andhra Pradesh
ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా...
By Benguluri Madhubabu 2026-03-09 09:54:19 0 143
Andhra Pradesh
రోడ్డు ప్రమాద బాధితులకు'' పీఎం -రావత్" వరం.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర...
By Pagadala Venkateswar 2026-05-07 06:08:05 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com