Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.

0
156

Andhra

Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday

 

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తల్లి పుట్టినరోజు సందర్భంగా రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత

జూలో నూతన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ప్రారంభించిన వైనం

జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు

కంభాలకొండలో 'నగర వనం' ప్రారంభించి, కనోపీ వాక్

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా, తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణకు ఏడాది పాటు అయ్యే ఖర్చును తానే పూర్తిగా భరిస్తానని తెలిపారు.

 

ఈ స్ఫూర్తితో జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా, జూపార్క్‌లో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏనుగులు, నీటి ఏనుగులు, పులులు, సింహాల ఎన్‍క్లోజర్ల వద్దకు వెళ్లి వాటి వివరాలను జూ క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. జూ నిబంధనలు పాటిస్తూ ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందించారు.

 

అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్, అక్కడ ఏర్పాటు చేసిన 'నగర వనం'ను ప్రారంభించారు. పార్క్‌లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ, మార్గమధ్యలో ఉన్న మొక్కల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.

Search
Categories
Read More
Punjab
Poll Silence Violated: Are We Respecting Democracy or Trampling It?
FIRs Filed Against Digital News Portals in Ludhiana for Publishing Poll Data During Election...
By Citizen Rights Council 2025-06-25 12:25:35 0 1K
Andhra Pradesh
పుంగనూరు: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో...
By Kothuru Murali 2026-06-22 10:55:27 0 70
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై...
By Kothuru Murali 2026-02-07 08:43:51 0 146
Business & Finance
Add Partners to Your Business Through the this Process
Adding partners to your business requires a clear legal process to ensure transparency and...
By Navya Sree 2026-07-20 05:23:28 0 24
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:45 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com