Andhra Pradesh High Court: ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు.

0
191

అన్ని రంగాల్లోకి శరవేగంగా వచ్చేస్తున్న ఏఐ

ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దన్న హైకోర్టు

ఏఐ సమాచారంలో చట్టపరంగా తప్పులు ఉండవచ్చని హెచ్చరిక

ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ శరవేగంగా చొచ్చుకొస్తోంది. ప్రజలకు అవసరమైన ఎన్నో సూచనలు, సలహాలను ఏఐ ఇస్తోంది. కీలకమైన వైద్య, న్యాయ రంగాల్లో సైతం ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సాయంతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

 

ఏఐని వాడటంపై చాలా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని సూచించింది. ఏఐ ఇచ్చే సమాచారం నమ్మదగినదిగా కనిపించినప్పటికీ... దాన్ని యథాతథంగా అమలు చేసే ప్రయత్నం చేయవద్దని తెలిపింది. ఏఐ ఇచ్చే సమాచారంలో చట్టపరంగా తప్పులు ఉండే అవకాశం ఉందని చెప్పింది. 

 

కొన్ని సందర్భాల్లో కేసుకు సంబంధం లేని తీర్పులను ఏఐ ఉదహరిస్తోందని, అసలు ఉనికిలో లేని తీర్పులను కూడా సృష్టిస్తోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐని గుడ్డిగా నమ్మి మనం తప్పులు చేస్తే... న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. 

 

విచారణ సందర్భంగా, ఏఐ సాయంతో ఉత్తర్వులను ఇచ్చిన సదరు న్యాయాధికారి మాట్లాడుతూ... తాను ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ సూచించినవేనని కోర్టుకు తెలిపారు. తాను తొలిసారి ఏఐని వాడానని, ఈ కారణంగానే పొరపాటు జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో, ఏఐని వినియోగించే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హైకోర్టు సూచించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
చింత మోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్
విశాఖపట్నం, 10-1-2026, శనివారం.    చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్...
By Rajini Kumari 2026-01-10 12:45:51 0 113
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-13 13:26:53 0 95
Andhra Pradesh
మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో...
By Pagadala Venkateswar 2026-03-12 06:33:40 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com