నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|

0
163

హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) 

నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి IPS స్పష్టం చేశారు. అంబర్ పేట లోని డిసిపి కార్యాలయ ఆవరణలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని యాక్టివ్ మరియు ఇన్ యాక్టివ్ ఆ రౌడీషీటర్లకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించినా, సెటిల్మెంట్లు, భూతగాదాలు, లేదా ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉక్కు పాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. నేరపూరిత జీవితాన్ని వదిలిపెట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా మారి కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా జీవించాలని సూచించారు.

పోలీస్ నిఘాలో రౌడీ షీటర్లు :

పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కేవలం కేసులు మాత్రమే కాకుండా, అవసరమైతే పీడీ (PD) యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి తెలిపారు. రౌడీ షీటర్ల కదలికపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఏసీపీలు, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.  

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
మధుర వాడ లో శక్తి క్యాంప్
విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ...
By Mobbu Venkatramana 2026-01-28 11:55:26 0 465
Andhra Pradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
By Boya Dasthagiri 2026-04-28 13:19:36 0 125
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సై ని కలిసిన కాంగ్రెస్ పార్టీ కమిటీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆన్సర్ భాష ను మంగళవారం...
By Kothuru Murali 2026-01-13 09:22:54 0 159
Andhra Pradesh
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
By Rajini Kumari 2026-04-13 08:11:57 0 97
Andhra Pradesh
Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!
రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన అమర్‌ బాబు బ్రెయిన్ డెడ్  అవయవదానానికి...
By Pagadala Venkateswar 2026-01-27 06:49:45 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com