విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ

0
134

పత్రికా ప్రకటన

 

ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026

 

తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల తయారీ - తిరుమలలో ఇంద్రకీలాద్రి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన

 

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు ముందడుగు వేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ శ్రీ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

 

ముఖ్య అంశాలు:

 తొలుత ఈఓ శీనా నాయక్, తిరుమల అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.

 తిరుమల ప్రధాన పోటు (లడ్డూ తయారీ కేంద్రం)ను సందర్శించి, అక్కడ ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత, తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అన్నప్రసాద వితరణ: భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటున్నారు, వడ్డన మరియు భక్తులు భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఇంజనీరింగ్ వివరాలు: తిరుమల ఇంజనీరింగ్ అధికారులు అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి వివరించారు.

 

త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు శీనా నాయక్ వెల్లడించారు. 

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, బి. రాంబాబు, ఏఈఓలు పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Goa
FC Goa Signs Jerry Lalrinzuala to Bolster Defense |
FC Goa has signed left-back Jerry Lalrinzuala to strengthen their defensive setup for the...
By Pooja Patil 2025-09-16 09:06:11 0 553
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 115
Telangana
జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన...
By Sidhu Maroju 2025-09-22 11:13:53 0 227
Dadra &Nager Haveli, Daman &Diu
Weather Alert: Heavy Rainfall Predicted
Weather Alert: Heavy Rainfall Predicted The India Meteorological Department has issued a yellow...
By BMA ADMIN 2025-05-23 07:01:19 0 2K
Andhra Pradesh
గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్
విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4...
By Mobbu Venkatramana 2026-03-31 15:59:59 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com