Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!

0
341

రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన అమర్‌ బాబు బ్రెయిన్ డెడ్ 

అవయవదానానికి అంగీకరించిన తల్లి కోటేశ్వరి

గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు

తల్లి నిర్ణయాన్ని అభినందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి

తీరని పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తన కుమారుడి అవయవాలను దానం చేసి, ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది.

 

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన పెరుగు అమర్‌ బాబు ఈ నెల 24న తాడికొండ మండలం నిడుముక్కలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే గుంటూరులోని ఆస్టర్‌ రమేశ్ ఆసుప‌త్రికి తరలించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతున్న స‌మ‌యంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో జీవన్‌దాన్‌ కో ఆర్డినేటర్లు అమర్ తల్లి కోటేశ్వరికి అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. కన్నీటి పర్యంతమైనప్పటికీ ఆమె తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు.

 

సోమవారం వైద్యులు అవయవాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. అమర్ గుండెను తిరుపతి పద్మావతి ఆసుప‌త్రికి తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. కాలేయం, ఒక కిడ్నీని గుంటూరు రమేశ్ ఆసుప‌త్రికి, మరో కిడ్నీని ఎన్‌ఆర్‌ఐ ఆసుప‌త్రికి, రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి అందించారు. ఈ అవయవదానం ద్వారా మొత్తం ఆరుగురు కొత్త జీవితాన్ని పొందారు.

 

అమర్‌ పుట్టిన ఏడాదికే తన భర్త చనిపోగా, ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో తల్లి కోటేశ్వరి వేదన వర్ణనాతీతం. అయినప్పటికీ తన కొడుకు మరో ఆరుగురి రూపంలో జీవించే ఉంటాడని ఆమె చెప్పడం పలువురిని కదిలించింది. విషయం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆసుప‌త్రికి వెళ్లి అమర్ తల్లిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంతటి దుఃఖంలోనూ మానవతా దృక్పథంతో గొప్ప నిర్ణయం తీసుకున్న వారిని ఆమె అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం...
By Kothuru Murali 2026-02-01 05:33:35 0 184
Business & Finance
Delhi's EV Policy Lifts Electric Vehicle Stocks
Shares of several electric vehicle-related companies gained following the announcement of Delhi's...
By Navya Sree 2026-07-01 08:05:07 0 62
Telangana
ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం....MLA శ్రీ దొంతి మాధవ రెడ్డి గారు...
*దుగ్గొండి మండలంలో కొనసాగుతున్న గృహప్రవేశాల పరంపర* భారత్ అవాజ్ న్యూస్: 18జూన్ నేడు వరంగల్...
By Gujile Ramu 2026-06-18 06:20:59 0 170
Telangana
నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ని సందర్శించిన ఎంమ్మెల్యే: కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని...
By Avunoori Mahesh 2026-06-21 09:32:53 0 205
Andhra Pradesh
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*   కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
By Rajini Kumari 2026-01-22 12:13:06 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com