జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|

0
128

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో అంబరాన్నంటాయి. మచ్చ బొల్లారం (డివిజన్ 133) కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 

" రెపరెపలాడిన జాతీయ పతాకం "

 అల్వాల్ లోని రాజీవ్ గాంధీ సర్కిల్, ఎంజీ నగర్, సప్తగిరి ఎంక్లేవ్, గోపాల్ నగర్ సర్కిల్, జిఎంఆర్ కాలనీ వంటి పలు ప్రాంతాల్లో నిర్వహించిన  పథకావిష్కరణ కార్యక్రమాల్లో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాఫలాలను ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం మేలుకొంది. 

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, సురేష్, ఉదయ్ కుమార్, భాస్కర్,  బలవంత్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, సూర్య కిరణ్, రాజనర్సింహారెడ్డి, కృష్ణ గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

" కార్యకర్తల కోలాహలం :"

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా విభాగం, ఎన్ ఎస్ యు ఐ  (NSUI) ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై హింద్, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వర్ధిల్లాలి, అన్న నినాదాలతో అల్వాల్ ప్రాంతం మారు మోగింది.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్...
By Pagadala Venkateswar 2026-01-31 07:51:38 0 104
Haryana
హర్యానా ఎన్నికలు 2024: EVM లపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు - నిజంగా అవకతవకలు జరిగాయా?
సంచలనం: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.ఆరోపణ: పోలింగ్ తర్వాత కాంగ్రెస్...
By Triveni Yarragadda 2025-08-11 05:44:21 0 1K
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి...
By Boya Dasthagiri 2026-04-05 13:50:16 0 71
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 157
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com