జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|

0
202

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో అంబరాన్నంటాయి. మచ్చ బొల్లారం (డివిజన్ 133) కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 

" రెపరెపలాడిన జాతీయ పతాకం "

 అల్వాల్ లోని రాజీవ్ గాంధీ సర్కిల్, ఎంజీ నగర్, సప్తగిరి ఎంక్లేవ్, గోపాల్ నగర్ సర్కిల్, జిఎంఆర్ కాలనీ వంటి పలు ప్రాంతాల్లో నిర్వహించిన  పథకావిష్కరణ కార్యక్రమాల్లో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాఫలాలను ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం మేలుకొంది. 

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, సురేష్, ఉదయ్ కుమార్, భాస్కర్,  బలవంత్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, సూర్య కిరణ్, రాజనర్సింహారెడ్డి, కృష్ణ గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

" కార్యకర్తల కోలాహలం :"

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా విభాగం, ఎన్ ఎస్ యు ఐ  (NSUI) ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై హింద్, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వర్ధిల్లాలి, అన్న నినాదాలతో అల్వాల్ ప్రాంతం మారు మోగింది.

#sidhumaroju

Search
Categories
Read More
Health & Fitness
No Link to Sudden Deaths and COVID Vaccination
There is no direct link between sudden deaths in adults and Covid-19 vaccines, the Ministry of...
By Bharat Aawaz 2025-07-03 08:31:56 0 3K
Bihar
Bihar Teacher Transfer Rules 2026: A Reformist Approach
The Bihar government has approved the landmark Bihar State Teacher Transfer Rules 2026, marking a...
By Lokeshwari Panthadi 2026-06-26 12:53:29 0 92
Andhra Pradesh
టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-07-01 04:43:40 0 97
Andhra Pradesh
విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి.
జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి రాబోయే...
By Pagadala Venkateswar 2026-06-12 11:03:51 0 91
Andhra Pradesh
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం: ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు; ...కర్మ రిటర్న్-ఎమ్మెల్యే...
By Chennaiah Kati 2026-07-03 09:50:05 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com