Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.

0
291

అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది

నాణేల మార్పిడి కోసం నగదును తీసుకెళుతున్నట్టు చెప్పిన వ్యక్తి

సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ కొనసాగుతున్న వేళ, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది. టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.60 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

 

 

 

ఈ ఉదయం ఒక వ్యక్తి తన కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా, అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారులో దాచి ఉంచిన కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు సదరు వ్యక్తిని నిలదీయగా, తిరుమలలో నాణేల మార్పిడి కోసం ఈ నగదును తీసుకెళుతున్నట్టు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

 

 

అంత భారీ మొత్తానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేదా బ్యాంకు పత్రాలు చూపకపోవడంతో, విజిలెన్స్ అధికారులు నగదుతో పాటు సదరు వ్యక్తిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? దీని అసలు యజమాని ఎవరు? నిజంగానే నాణేల కోసమా లేక ఇతర రాజకీయ లేదా వ్యాపార లావాదేవీల కోసమా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో పలు ఘటనలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఈ భారీ నగదు పట్టుబడటం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది.

Search
Categories
Read More
Delhi - NCR
IMD Forecasts Rain and Thunderstorms for Delhi-NCR
The India Meteorological Department (IMD) has forecast light to moderate rainfall, thunderstorms,...
By Navya Sree 2026-06-27 06:41:09 0 74
Haryana
Haryana Advances Renewable Energy and Green Development
Haryana continues to expand its renewable energy sector by promoting solar power, rooftop solar...
By Fathima Safa 2026-07-06 08:53:33 0 150
Andhra Pradesh
 216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు
216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  ...
By Gadiyapudi Narendra 2025-12-24 17:18:07 0 469
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.
శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో...
By Pagadala Venkateswar 2026-06-06 05:45:29 0 80
Andhra Pradesh
డోన్ ఒకతపల కార్యాలయం నందు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ;;
కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని  డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ...
By Hari Krishna 2026-01-26 08:24:15 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com