Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.

0
177

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు హర్షం

ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్

మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ సహా పలువురికి పద్మశ్రీ

ఈ పురస్కారాలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్ష

2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు శుభాకాంక్షలు చెబుతూ, ముఖ్యంగా 13 మంది తెలుగు వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కడం పట్ల ఆయన ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.

 

ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ పురస్కారం లభించడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా, పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారందరికీ ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలలో యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ ఉన్నారు.

 

ఇంకా సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, గడ్డమనుగు చంద్రమౌళి... వైద్య రంగంలో పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకట్రావు... సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రి... నృత్యంలో దీపికారెడ్డిలకు అభినందనలు తెలిపారు. మరణానంతరం పద్మశ్రీ పొందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), రామారెడ్డి మామిడి (పశుసంవర్ధక)ల సేవలను కూడా సీఎం స్మరించుకున్నారు.

 

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించి తెలుగు జాతి ఖ్యాతిని మరింతగా వెలిగించిన ఈ ప్రముఖుల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. - కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి?
📝 కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి? 🌟 ప్రధానాంశాలు:  తెలంగాణ...
By Bharat Aawaz 2025-06-23 14:17:43 0 2K
Telangana
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...
By Ponnala Srinivasrao 2026-05-10 01:52:56 0 123
Andhra Pradesh
ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి
*ప్రచురణార్థం* *18-01-2026*   *ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి*  ...
By Rajini Kumari 2026-01-18 13:25:00 0 166
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 239
Mizoram
Lunglei Achieves 107% HPV Vaccination Target Success
Mizoram’s healthcare sector has marked a significant milestone, with the Lunglei district...
By Lokeshwari Panthadi 2026-07-02 06:47:27 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com