Nara Lokesh: ఏపీకి 'పద్మ' శోభ... మంత్రి నారా లోకేశ్.

0
101

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు

నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు ప్రతిష్ఠాత్మక గౌరవం

దివంగత సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం పురస్కారం

కూచిపూడి కళాకారుడు వేంపటి కుటుంబశాస్త్రికి కూడా పద్మశ్రీ

పురస్కార గ్రహీతలకు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలు-2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. సినీ, సంగీత, నృత్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. పురస్కార గ్రహీతలలో నటులు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీ మోహన్, కూచిపూడి కళాకారుడు వేంపటి కుటుంబశాస్త్రి, దివంగత సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఉన్నారు.

 

ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ పురస్కార గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమాకు రాజేంద్ర ప్రసాద్ జీవితకాల సేవలు అసాధారణమైనవని కొనియాడారు. దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తన అన్నమాచార్య కీర్తనలతో రాష్ట్ర సంగీత, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారని గుర్తుచేసుకున్నారు.

 

అదేవిధంగా, భారతీయ సినిమాకు, ప్రజా జీవితానికి దశాబ్దాలుగా మురళీ మోహన్ అందించిన సేవలు గొప్పవని లోకేశ్ ప్రశంసించారు. కూచిపూడి నృత్యంలో వేంపటి కుటుంబశాస్త్రి పాండిత్యం మన సంప్రదాయ కళలను ప్రపంచ వేదికపై నిలిపిందని అన్నారు. ఈ నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు రావడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
Exhibition
From January 1st 2026 exhibition opening. 
By G k Nookala 2025-12-29 14:21:22 0 261
Telangana
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా? తెలంగాణ : సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల...
By Pinnehasan Odela 2026-01-15 14:21:50 0 172
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...
By Pagadala Venkateswar 2026-02-16 05:00:45 0 156
Telangana
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....
By Pinnehasan Odela 2026-01-16 15:06:03 0 265
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com