ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.

0
98

బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు ఘనంగా రహదారి భద్రతా అవగాహన ర్యాలీ

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు - 2026'లో భాగంగా బాపట్ల పట్టణంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, పాత బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎంపీ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.  అనంతరం బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారితో కలిసి విద్యార్థులు, యువతతో రహదారి నిబంధనలు పాటించేలాగా ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో DRO గంగాధర్, District RTO పారణసామీ రెడ్డి, DMHO విజయమ్మ, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.
పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీపై ప్రధానంగా చర్చ రాయలసీమ నుంచి కోస్తాకు మెరుగైన...
By Pagadala Venkateswar 2026-01-29 07:23:20 0 38
Telangana
ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
సికింద్రాబాద్/అడ్డగుట్ట   సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ...
By Sidhu Maroju 2025-07-19 13:33:26 0 888
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com