ఎస్సై కి ఆహ్వానం పలికిన హనుమాన్ స్వాములు

0
497

​కొత్తగూడ, ఏప్రిల్ 17,మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హనుమాన్ ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి హనుమాన్ స్వాములు స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ​ఏప్రిల్ 21న హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. అలాగే ​ఏప్రిల్ 22న మండలకేంద్రంలో పురవీధుల్లో హనుమాన్ నగర సంకీర్తన నిర్వహించనున్నారు. భక్తుల కోలాహలం, భజన కీర్తనలతో ఈ కార్యక్రమం కనువిందుగా సాగనుంది.​ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, హనుమాన్ సేవా సమితి ప్రతినిధులు మరియు హనుమాన్ మాలధారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సైని కలిసి కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

​"భక్తిభావంతో నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని" నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపురపు బిక్షపతి, కల్లూరి కృష్ణ చారి, నాగబేల్లి శోభన్ గట్ల శ్రీను, గూడూరు దుర్గాప్రసాద్, ప్రశాంత్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:15:19 0 114
Andhra Pradesh
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-02-15 05:49:44 0 131
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 498
Telangana
తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Sunka Santhosh 2026-05-23 18:34:55 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com