నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.

0
147

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని వెలగపూడి సచివాలయంలో కలిసి విన్నవించాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కల్వర్టు నిర్మాణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే విషయాన్ని మంత్రి గారికి తెలియజేశాం. జాకీర్ హుస్సేన్ నగర్ లో రోడ్డు ప్రస్తుతం ఇరువైపులా వంద అడుగుల మేర ఉందని, కల్వర్టు మాత్రం కేవలం 30 అడుగులు మాత్రమే ఉందని, ఈ కారణంగా ట్రాఫిక్ తోపాటు భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని వివరించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేపట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ రహదారిలో వాహనాల రాకపోకలు మరింత పెరిగి ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందనే విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పటికే కల్వర్టు నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారులు రూ.2.52 కోట్లతో అంచనాలు రూపొందించారని, ప్రతిష్టాత్మకమైన, ప్రజోపయోగకమైన కల్వర్టు నిర్మాణానికి వెంటనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని విన్నవించాను. నా వినతి మేరకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆధునిక పరికరాల పై 90 శాతం రాయితీ.
AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త....
By John Baji 2025-12-23 07:51:54 0 187
Andhra Pradesh
Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్.
జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే...
By Pagadala Venkateswar 2026-03-28 04:33:44 0 110
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com