మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
211

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది పర్వదినం, సబ్బండ వర్ణాల శ్రామిక, సాంస్కృతిక జీవనంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకున్నట్లే, ప్రజలందరి జీవితాల్లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జీవితంలోని కష్టసుఖాలను ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె సమానంగా స్వీకరిస్తూ, వివేచనతో ముందుకు సాగినప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Telangana
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం...
By Sidhu Maroju 2025-11-26 08:58:38 0 190
Telangana
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
By Sadaq Sadaq 2026-04-19 12:04:32 0 124
Telangana
తెలంగాణ సత్తెమ్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నీటి నివాళి
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-04-20 01:58:10 0 122
SURAKSHA
Muddada Ravi Chandra, IAS: Leading Good Governance
A Dynamic Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 10:30:17 0 70
Business & Finance
Hassle-Free Private Company Share Transfer Services
Transfer private company shares smoothly with professional online share transfer services in...
By Navya Sree 2026-07-08 08:08:26 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com