మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
176

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది పర్వదినం, సబ్బండ వర్ణాల శ్రామిక, సాంస్కృతిక జీవనంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకున్నట్లే, ప్రజలందరి జీవితాల్లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జీవితంలోని కష్టసుఖాలను ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె సమానంగా స్వీకరిస్తూ, వివేచనతో ముందుకు సాగినప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Telangana
అడవి తల్లి దీవెన.... గుంజేడు ముసలమ్మ జాతర!
ఈ జాతర కేవలం మొక్కుల పండుగే కాదు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేదిక ఈనెల 4 నుండి గుంజేడులో...
By Bittu Bittu 2026-03-02 04:08:01 0 3K
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.
శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు...
By Pagadala Venkateswar 2026-05-22 12:36:15 0 40
Andhra Pradesh
మదనపల్లెలో గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ చికిత్స.
మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు....
By Pagadala Venkateswar 2026-04-30 04:12:57 0 53
Andhra Pradesh
అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్
*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*   అమరావతి: అమరావతిలో...
By Rajini Kumari 2026-03-13 13:38:45 0 131
Andhra Pradesh
మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*   * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ * వైసీపీ హయాంలో మహిళల...
By Rajini Kumari 2026-03-10 09:12:56 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com