Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.

0
151

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్

ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడి

ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్న జగన్

ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, “జగన్ ఉంటే బాగుండేదని” ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో మూడేళ్లేనని అన్నారు.

 

ఇక తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నామని తెలిపారు.

 

చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించిన జగన్.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎవరితోనైనా ఎలా కావాలంటే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

 

అలాగే, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని జగన్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు విద్యార్థులు భారీగా చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీలను కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జగన్ ఆరోపించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిద్ధమవుతున్న రిపబ్లిక్ డే వేడుకలు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   గుంటూరు జిల్లా పోలీస్...* *తేది :...
By KOTESWARARAO KVSR 2026-01-06 14:39:59 0 631
Andhra Pradesh
గుంటూరు యువత జాగర్త
గుంటూర్ ఎస్పి గోకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ లో యువతకు పలు సూచనలు...
By KOTESWARARAO KVSR 2025-12-22 05:44:28 0 250
Andhra Pradesh
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కడుపులో గడ్డను బిడ్డ అని తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ చేసిన ప్రభుత్వ డాక్టర్లు
*గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కడపులో గడ్డను ... బిడ్డ అని చెబుతూ 9 నెలలుగా ప్రభుత్వ డాక్టర్లు...
By Rajini Kumari 2026-03-12 13:32:39 0 171
Andhra Pradesh
పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారం - ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి
చీరాల  చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం...
By Vadlamudi NagaVenkat 2026-05-13 02:43:37 0 234
Telangana
నకిలీ తుపాకి - ఆపై బెదిరింపు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ...
By Sidhu Maroju 2026-01-02 14:58:08 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com