Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.

0
285

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో కీలక పరిణామం

వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను సేకరిస్తున్న హోంశాఖ

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణకు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చర్యతో రాజధానిపై ఉన్న అనిశ్చితికి తెరపడనుంది.

 

2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. 2024 జూన్ 2తో ఆ గడువు ముగియడంతో, ఏపీకి స్వతంత్ర రాజధానిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, అమరావతిని రాజధానిగా ఖరారు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ఒక నివేదిక పంపింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, చేపట్టిన నిర్మాణాల వివరాలతో కూడిన నోట్‌ను సమర్పించింది.

 

ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోంశాఖ, దీనిపై తదుపరి చర్యలు ప్రారంభించింది. రాజధాని ఎప్పటి నుంచి అమల్లోకి రావాలో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, 2024 జూన్ 2 నుంచే వర్తింపజేయాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖలతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాలను కూడా కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది.

 

అన్ని శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. క్యాబినెట్ ఆమోదం లభించగానే, పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణ కోసం బిల్లును ప్రవేశపెడతారు. ఈ చట్టసవరణతో అమరావతికి రాజధానిగా శాశ్వత భద్రత, చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. తద్వారా భూములిచ్చిన రైతులకు, పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందని, రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు
వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు...
By Chennaiah Kati 2026-06-26 16:55:48 0 68
Andhra Pradesh
ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో...
By Shyamala Yadagiri 2026-07-18 10:26:11 0 41
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా 27-01-2026 Tue 15:46 | Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-01-28 10:39:12 0 153
SURAKSHA
Telangana Retired Police: Serving People Without Uniform
Retirement తర్వాత Telangana Police officers uniform లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. Slum areas...
By Kalaga Sailaja 2026-07-03 11:26:19 0 26
Telangana
ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలు
మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల...
By Bheeshman King 2026-04-29 12:16:03 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com