Vangalapudi Anitha: మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది.. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి మంత్రి అనిత అభినందనలు.

0
66

విధి నిర్వహణలో చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి

జయశాంతి చర్య పోలీసులపై ప్రజల నమ్మకాన్ని పెంచిందన్న అనిత

త్వరలో కలుద్దామని కానిస్టేబుల్‌కు హామీ ఇచ్చిన హోంమంత్రి

మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. విధి నిర్వహణలో లేనప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన తీరును మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

 

జయశాంతి వంటి వారి నిబద్ధత వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో మరింత గౌరవం, నమ్మకం పెరుగుతాయని మంత్రి అనిత అన్నారు. జయశాంతి చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసేందుకు జయశాంతి ఆసక్తి చూపగా, త్వరలోనే తప్పకుండా కలుద్దామని అనిత హామీ ఇచ్చారు.

 

ఈ విషయంపై మంత్రి అనిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతిని సోషల్ మీడియాలో అభినందించిన ప్రతిఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో...
By Gadiyapudi Narendra 2026-01-04 10:38:03 0 137
Telangana
బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|
కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ      హైదరాబాద్: 19 మంది ప్రాణాలు తీసిన ఒక...
By Sidhu Maroju 2025-10-25 15:44:11 0 148
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే...
By Benguluri Madhubabu 2026-01-28 07:35:56 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com