అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|

0
177

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ అవాజ్ ప్రతినిధి) తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న ప్రమాదాల మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం చట్టాలను అమలు చేయడమే కాకుండా  ప్రజల్లో అంతర్గత మార్పు తీసుకునే వాళ్ళనే సదుద్దేశంతో అల్వాల్ పోలీసులు చేపట్టిన "అరైవ్ అలైవ్"  (Arrive Alive) కార్యక్రమం కొత్తవడిని సృష్టిస్తుంది. జాతీయ రోడ్డు భద్రత మాసరోత్సవాల్లో భాగంగా హకీంపేట బస్ డిపోలో జరిగిన ఈ అవగాహన సదస్సుపై భారత్ అవాజ్ గ్రౌండ్ రిపోర్ట్.

 లక్ష్యం:ప్రతి ప్రయాణం ఒక సురక్షిత ప్రయాణం కావాలి.

ప్రభుత్వం యొక్క ప్రధాన "లక్ష్యం ప్రమాదాలలో నివారించి సురక్షంగా గమ్యానికి చేరుకోవాలనే" సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాళ్లడం.

 ఈసారి రద్దీగా ఉండే హకీంపేట బస్ డిపోను ఎంచుకొని వందలాదిమంది ప్రయాణికులు, మరియు ఆర్టీసీ డ్రైవర్లను నేరుగా కలిశారు. 

ఈ సందర్భంగా అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ అనేది ఒక నైపుణ్యం మాత్రమే కాదు, అది అనేకమంది ప్రాణాలతో ముడిపడిన అత్యంత బాధ్యత. ఒక చిన్న తప్పిదం వారిని రోడ్డున పడేస్తుంది. అని భావోద్వేగంగా మాట్లాడారు.

ప్రజాభిప్రాయం : ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘ డ్యూటీ వేళలు, రోడ్లపై అస్తవ్యస్తమైన పరిస్థితులు, తమను ఒత్తిడికి గురి చేస్తున్నాయని పోలీసుల దృష్టికి తెచ్చారు. పోలీసులు వారి సమస్యలను సావధానంగా విని, ఉన్నతాధికారులకు మీ సమస్యలను చేరవేరుస్తామని వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఒక తూతూమంత్రపు సదస్సులా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. చట్టాన్ని అమలు చేసే పోలీసులు తమ పౌర బాధ్యతగా ప్రజలతో మమేకమైతే సామాజిక మార్పు సాధ్యమని ఈ సంఘటన సూచించింది. 

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్సై దేవేందర్, ట్రాఫిక్,  పోలీస్ సిబ్బంది, మరియు డిపో మేనేజర్ పాల్గొన్నారు.

భారత్ ఆవాజ్ ఇలాంటి సామాజిక హిత కార్యక్రమాలను  మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.

#sidhumaroju

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్‌!
గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం...
By Shyamala Yadagiri 2026-05-16 18:36:43 0 64
Andhra Pradesh
రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్...
By Benguluri Madhubabu 2026-03-15 12:18:31 0 181
Andhra Pradesh
విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన
*ప్రచురణార్థం* ది:19-04-2026   *వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ...
By Rajini Kumari 2026-04-19 12:29:33 0 86
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com