అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|

0
233

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ అవాజ్ ప్రతినిధి) తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న ప్రమాదాల మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం చట్టాలను అమలు చేయడమే కాకుండా  ప్రజల్లో అంతర్గత మార్పు తీసుకునే వాళ్ళనే సదుద్దేశంతో అల్వాల్ పోలీసులు చేపట్టిన "అరైవ్ అలైవ్"  (Arrive Alive) కార్యక్రమం కొత్తవడిని సృష్టిస్తుంది. జాతీయ రోడ్డు భద్రత మాసరోత్సవాల్లో భాగంగా హకీంపేట బస్ డిపోలో జరిగిన ఈ అవగాహన సదస్సుపై భారత్ అవాజ్ గ్రౌండ్ రిపోర్ట్.

 లక్ష్యం:ప్రతి ప్రయాణం ఒక సురక్షిత ప్రయాణం కావాలి.

ప్రభుత్వం యొక్క ప్రధాన "లక్ష్యం ప్రమాదాలలో నివారించి సురక్షంగా గమ్యానికి చేరుకోవాలనే" సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాళ్లడం.

 ఈసారి రద్దీగా ఉండే హకీంపేట బస్ డిపోను ఎంచుకొని వందలాదిమంది ప్రయాణికులు, మరియు ఆర్టీసీ డ్రైవర్లను నేరుగా కలిశారు. 

ఈ సందర్భంగా అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ అనేది ఒక నైపుణ్యం మాత్రమే కాదు, అది అనేకమంది ప్రాణాలతో ముడిపడిన అత్యంత బాధ్యత. ఒక చిన్న తప్పిదం వారిని రోడ్డున పడేస్తుంది. అని భావోద్వేగంగా మాట్లాడారు.

ప్రజాభిప్రాయం : ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘ డ్యూటీ వేళలు, రోడ్లపై అస్తవ్యస్తమైన పరిస్థితులు, తమను ఒత్తిడికి గురి చేస్తున్నాయని పోలీసుల దృష్టికి తెచ్చారు. పోలీసులు వారి సమస్యలను సావధానంగా విని, ఉన్నతాధికారులకు మీ సమస్యలను చేరవేరుస్తామని వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఒక తూతూమంత్రపు సదస్సులా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. చట్టాన్ని అమలు చేసే పోలీసులు తమ పౌర బాధ్యతగా ప్రజలతో మమేకమైతే సామాజిక మార్పు సాధ్యమని ఈ సంఘటన సూచించింది. 

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్సై దేవేందర్, ట్రాఫిక్,  పోలీస్ సిబ్బంది, మరియు డిపో మేనేజర్ పాల్గొన్నారు.

భారత్ ఆవాజ్ ఇలాంటి సామాజిక హిత కార్యక్రమాలను  మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.

#sidhumaroju

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 285
Telangana
పెట్రోల్ డీజిల్ కొరతలు.....
భరత్ అవాజ్ న్యూస్ : ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు.... వరంగల్...
By Gujile Ramu 2026-04-28 03:30:37 0 279
Telangana
బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|
కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ      హైదరాబాద్: 19 మంది ప్రాణాలు తీసిన ఒక...
By Sidhu Maroju 2025-10-25 15:44:11 0 263
Andhra Pradesh
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
By Pagadala Venkateswar 2026-03-31 03:32:22 0 145
Andhra Pradesh
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య...
By Patan Khuddus 2026-04-22 12:26:06 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com