పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!

0
55

కర్నూలు : నంద్యాల : డోన్: 

ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులు మరియు పశుపాలకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు 19-01-2026 నుండి 30-01-2026 వరకు నిర్వహించబడతాయని, పశుపాలకులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు.

ఈ శిబిరాల ద్వారా పశువులకు ఉచిత వైద్య చికిత్సలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, అలాగే వివిధ నివారణ మందుల పంపిణీ నిర్వహించబడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలోని పశుసంపద ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


Search
Categories
Read More
Andhra Pradesh
2026 జీడీసీసీ బ్యాంకు క్యాలెండర్ ఆవిష్కరణ
 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు *జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు*...
By John Baji 2025-12-31 01:41:54 0 132
Andhra Pradesh
ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ :
కర్నూలు :  కర్నూలు జిల్లా  సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లోకరాజు గారు కర్నూలు...
By Hari Krishna 2025-12-29 00:33:00 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com