పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!

0
137

కర్నూలు : నంద్యాల : డోన్: 

ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులు మరియు పశుపాలకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు 19-01-2026 నుండి 30-01-2026 వరకు నిర్వహించబడతాయని, పశుపాలకులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు.

ఈ శిబిరాల ద్వారా పశువులకు ఉచిత వైద్య చికిత్సలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, అలాగే వివిధ నివారణ మందుల పంపిణీ నిర్వహించబడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలోని పశుసంపద ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


Search
Categories
Read More
Andhra Pradesh
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్స్‌కు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి. నూతన...
By Gadiyapudi Narendra 2025-12-27 15:59:07 0 209
Andhra Pradesh
భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్
*భోగి పర్వదినం* సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో...
By Rajini Kumari 2026-01-14 12:42:20 0 153
Telangana
"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో...
By Sidhu Maroju 2026-05-21 13:40:23 0 81
Telangana
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత  5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
By Mittapelli Saketh 2025-12-23 08:26:26 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com