పన్ను బకాయిల చెల్లింపు మీ బాధ్యతగా గుర్తించండి : మున్సిపల్ కమిషనర్

0
139

కర్నూలు : కర్నూలు సిటీ : 

‘పన్ను చెల్లింపు బాధ్యతగా భావించండి’

• నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ
• 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులు సీజ్ !!

నగరపాలక సంస్థకు పన్ను చెల్లించడం భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ మొండి బకాయిదారులకు సూచించారు. సోమవారం నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, పార్కుల నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి నగరపాలక సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలంటే వంద శాతం బకాయిలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొందరు పన్నులు చెల్లించకుండా ఇతరులు చెల్లించిన పన్నులతో నగరపాలక సేవలు పొందాలనుకోవడం సమంజసం కాదన్నారు. ప్రతి పౌరుడు పన్ను చెల్లింపును బాధ్యతగా భావించినప్పుడే నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రతిరోజూ కొనసాగిస్తామని, అగ్ర మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఆర్వోలు జునైద్, వాజీద్, స్వర్ణలత, ఆర్‌ఐలు భార్గవ్, తిప్పన్న, శ్రీకాంత్, ఏఆర్‌ఐలు, అడ్మిన్‌లు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల భద్రత కోసం పోలీసుల ముమ్మర అవగాహన కార్యక్రమాలు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను లక్ష్యంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-17 03:31:09 0 81
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 1K
Andhra Pradesh
కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ రెడ్డి ఆదేశాల మేరకు
కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని బూత్ నంబర్...
By mahaboob basha 2025-07-16 14:47:02 0 1K
Andhra Pradesh
పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును...
By Kothuru Murali 2026-04-09 07:40:23 0 95
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com