మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
120

దావోస్

 

• *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*

 

• నాలుగు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్న ముఖ్యమంత్రి.

 

• పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటన చేపడుతోన్న ముఖ్యమంత్రి బృందం.

 

• ఈ ఏడాది నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రికార్డు స్థాయిలో ప్రతినిధులు హాజరవుతారని అంచనా.

 

• సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం.

 

• WEF సదస్సుకు హాజరు కానున్న సుమారు 60 దేశాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు.

 

• ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారతదేశం నుంచి హాజరుకానున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

 

• *ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానుండడంతో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను పూర్తి స్థాయిలో వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సిద్దం చేసిన ఏపీ ప్రభుత్వం.*

 

• *గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు సాధించేలా ప్రణాళికలు*

 

• టూరిజం, హాస్పటాలిటీ, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులపైనా ఫోకస్ పెట్టనున్న కూటమి సర్కార్.

 

• *వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తెచ్చిన పాలసీలను జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు వివరించనున్న సీఎం బృందం.*

 

• *అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామనే అంశాన్ని పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లనున్న ప్రభుత్వం.*

 

• *ఏఐ నిపుణులను సిద్దం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధానంగా ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు బృందం.*

 

• *లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేసేలా అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సు నిర్వహిస్తున్నామని వెల్లడించనున్న ఏపీ ప్రభుత్వం.*

 

• *ఇప్పటికే 50 వేల మంది అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సులో శిక్షణకు నమోదు చేసుకున్నట్టు పారిశ్రామిక వేత్తలకు స్పష్టం చేయనున్న చంద్రబాబు.*

 

• *కాకినాడ గ్రీన్ అమోనియా-గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్న సీఎం.*

 

• *గతేడాది ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు... జరిపిన సంప్రదింపుల్లో సుమారు రూ. 2.36 లక్షల కోట్ల మేర పెట్టుబడులను రాబట్టగలిగిన ఏపీ ప్రభుత్వం.*

 

• *2025 WEF సదస్సులో చర్చలు జరిపిన 20 కంపెనీల నుంచి ఏపీకి పెట్టుబడులు.*

 

• ఈసారి పర్యటనలో అంతకు మించిన పెట్టుబడులు రాబట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు.

 

• విశాఖ పెట్టుబడుల సదస్సు వివరాలను పారిశ్రామిక వేత్తలకు అందించనున్న టీమ్ ఏపీ.

 

• తొలి రోజు పర్యటనలో మొత్తంగా ఏడు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం.

 

• తొలి రోజు పర్యటనలోనే తెలుగు డయాస్పోరా వేదికగా తెలుగువారితో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.

 

• *తెలుగు డయాస్పోరాకు 20 దేశాల నుంచి హాజరుకానున్న తెలుగు ప్రజలు.*

 

• *పారిశ్రామిక వేత్తలుగా మారాలని ఎన్నార్టీలను కోరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.*

 

• సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు.

Search
Categories
Read More
Telangana
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ...
By Ponnala Srinivasrao 2026-04-27 05:02:39 0 92
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 267
Andhra Pradesh
పుంగనూరు: కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టు సంఘ సభ్యులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ...
By Kothuru Murali 2026-05-03 16:26:25 0 52
Music
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom Veteran...
By BMA ADMIN 2025-05-22 17:25:33 0 2K
Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో...
By Pagadala Venkateswar 2026-02-04 07:34:06 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com