విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

0
131

*విజయవాడ నగరపాలక సంస్థ*

*19-01-2026*

 

 

*ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి*

 

 

 

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 4, ఇంజనీరింగ్ 3, పబ్లిక్ హెల్త్ 1, రెవెన్యూ 1 మొత్తం కలిపి 9 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ వి.కామేశ్వరరావు పాల్గొన్నారు. 

 

 

 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా...
By Ponnala Srinivasrao 2026-03-15 17:16:42 0 222
Telangana
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని
*నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని*   ఫిరాయింపు ఎమ్మెల్యే...
By Ellandula Sandeep 2025-12-24 14:22:20 0 490
Telangana
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...
By Avunoori Mahesh 2026-04-26 12:30:56 0 105
Andhra Pradesh
నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన...
By Patan Khuddus 2026-05-03 13:05:30 0 220
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com