Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.

0
185

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి

 

23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ

రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన వైనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది.

 

ఇదివరకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 22వ తేదీన విచారణకు రావాలని కోరిన ఈడీ, ఆ మరుసటి రోజే మిథున్ రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులుండాలి
ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ...
By Boiena Rajesh 2026-05-09 13:22:37 0 196
Health & Fitness
Global Health Agencies Monitor Hantavirus Outbreak
Public health agencies are tightly monitoring a rare orthohantavirus cluster linked to a South...
By Dunna Jessicaruth 2026-05-19 07:00:31 0 80
Andhra Pradesh
NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం
*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం*  ...
By Rajini Kumari 2025-12-26 09:55:55 0 335
SURAKSHA
Ilambarithi K., IAS: A Leader in Public Governance
From Academic Excellence to Administrative Leadership—How Ilambarithi K., IAS, Is Shaping...
By Lokeshwari Panthadi 2026-07-14 05:04:04 0 98
Telangana
మంచిర్యాల్: రైల్లోలో చోరీ నిందితుడు అరెస్ట్
ఈనెల 25 న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ లుకుచేసినట్లు ...
By Bonagiri RaviShankar 2026-05-30 12:10:08 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com