అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు

0
215

అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు 

జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పార్శిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

 

జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు... గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా అనంతపురం త్రీటౌన్ సి.ఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతపురం త్రీటౌన్ పరిధిలోని వివిధ పార్శిల్ సర్వీస్ కార్యాలయాలు మరియు ఆర్టీసీ బస్టాండులలో స్నిఫర్ డాగ్ సహకారంతో విస్తృత తనిఖీలు కొనసాగాయి. పార్శిళ్ల ద్వారా గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టి ప్రజల భద్రతను కాపాడడమేనని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత మరియు గంజాయి కట్టడి దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే ప్రజలు ఎవరైనా మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Search
Categories
Read More
Telangana
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే...
By Vanmoj Suryamohan 2026-01-13 15:03:09 0 153
Telangana
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్...
By Pinnehasan Odela 2026-01-19 11:13:05 0 139
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 99
Andhra Pradesh
రైలు వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3 పర్సెంట్ రాయితీ ! రైల్వే
కర్నూలు # రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14...
By Hari Krishna 2025-12-31 11:25:02 0 113
Andhra Pradesh
Nara Lokesh: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: నారా లోకేశ్.
పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:29:54 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com