అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు

0
434

అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు 

జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పార్శిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

 

జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు... గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా అనంతపురం త్రీటౌన్ సి.ఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతపురం త్రీటౌన్ పరిధిలోని వివిధ పార్శిల్ సర్వీస్ కార్యాలయాలు మరియు ఆర్టీసీ బస్టాండులలో స్నిఫర్ డాగ్ సహకారంతో విస్తృత తనిఖీలు కొనసాగాయి. పార్శిళ్ల ద్వారా గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టి ప్రజల భద్రతను కాపాడడమేనని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత మరియు గంజాయి కట్టడి దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే ప్రజలు ఎవరైనా మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి దేవినేని అవినాష్ రాష్ట్ర అధికారి పొట్లూరి దర్శిత్
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా...
By Rajini Kumari 2026-03-06 01:48:04 0 143
Telangana
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
By Sadaq Sadaq 2026-04-27 16:10:03 0 98
Andhra Pradesh
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :  గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ...
By Hari Krishna 2026-01-24 07:44:17 0 384
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com