విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి

0
184

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారి వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం కాదని, ప్రజలకు అండగా నిలిచే వ్యవస్థ అనే భావనను నాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అలాంటి మహానాయకుడ్ని చూస్తూ తాను ఎదిగానని, ఈ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని మంత్రి అనిత పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. తెలుగు ప్రజల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అనిత స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Vijayasai Reddy: ఆ కోటరీని నమ్మితే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: విజయసాయిరెడ్డి.
లిక్కర్ స్కాంలో ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రాజకీయాల...
By Pagadala Venkateswar 2026-01-23 05:57:56 0 92
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 161
Andhra Pradesh
మున్సిపల్ ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్
కర్నూలు :  ప్రతి ఓటు విలువైనదే..• కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్...
By Hari Krishna 2026-01-23 14:04:22 0 125
Andhra Pradesh
మదనపల్లె: పెళ్లికి వస్తుండగా ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు.
తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ధనుష్(22)...
By Pagadala Venkateswar 2026-03-06 07:49:14 0 88
Andhra Pradesh
మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్...
By Pagadala Venkateswar 2026-01-31 07:51:38 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com