Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.

0
206

రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం

వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి

నా మనోవేదన తీర్చిన శ్రీనివాసుడికి మొక్కుబడి యాత్ర అని వ్యాఖ్య

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టైన సందర్భంలో శ్రీనివాసుడికి మొక్కుకున్నానని, తాజాగా ఈ మొక్కు చెల్లించుకోవడానికి సంకల్ప యాత్ర చేపడుతున్నానని వివరించారు. ‘నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు షాద్ నగర్ లోని తన నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

 

‘దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించా. తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. చంద్రబాబు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే ఆయనపై కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కు తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నా మొక్కుబడి చెల్లింపు’ అని బండ్ల గణేశ్‌ తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
బైక్ అదుపుతప్పి ఇటుకల బట్టీ కార్మికుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య,...
By Pagadala Venkateswar 2026-02-25 08:31:00 0 195
Andhra Pradesh
అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు
విజయవాడ 01-04-2026    ప్రచురణార్థం    *బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప...
By Rajini Kumari 2026-04-01 09:16:50 0 168
Haryana
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 05:19:26 0 29
Telangana
మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్...
By Veeresh Kumar 2026-04-01 02:12:44 0 570
Telangana
ఆ స్నేహితులు మద్యానికి బానిసలు, ముఠాగా ఏర్పడి దారిదోపిడిలు- అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడిలకు పాల్పడుతూ ఎట్టకేలకు...
By Sidhu Maroju 2025-11-04 15:10:06 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com