Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.

0
134

రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం

వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి

నా మనోవేదన తీర్చిన శ్రీనివాసుడికి మొక్కుబడి యాత్ర అని వ్యాఖ్య

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టైన సందర్భంలో శ్రీనివాసుడికి మొక్కుకున్నానని, తాజాగా ఈ మొక్కు చెల్లించుకోవడానికి సంకల్ప యాత్ర చేపడుతున్నానని వివరించారు. ‘నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు షాద్ నగర్ లోని తన నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

 

‘దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించా. తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. చంద్రబాబు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే ఆయనపై కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కు తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నా మొక్కుబడి చెల్లింపు’ అని బండ్ల గణేశ్‌ తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 175
Andhra Pradesh
పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు
*పూర్ణాహుతితో వైభవంగా*   *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*        ...
By Rajini Kumari 2025-12-15 10:54:18 0 156
Andhra Pradesh
కురబలకోట: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు.
కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ, సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-03-03 02:53:01 0 78
Andhra Pradesh
వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్ధరించాలి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
*వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి    సత్వరమే నూతన వె్జ్ బోర్డు ఏర్పాటు...
By Rajini Kumari 2026-03-28 14:26:00 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com