మొండి బకాయి దారులపై కఠినంగా వ్యవహరించాలి : మున్సిపల్ కమిషనర్

0
58

కర్నూలు: కర్నూలు సిటీ : 

మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• పన్ను వసూళ్లకు మూడు ప్రత్యేక బృందాలు
• దీర్ఘకాలిక బకాయిదారుల ఆస్తుల సీజ్, జప్తు

నగరంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను మొండి బకాయిదారులపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు ఇచ్చిన గడువులు, ఉదాసీనత వైఖరి ఇక చాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక కార్యాలయంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

నగర అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా ముందుకు సాగాలంటే నిధుల లభ్యత కీలకమని, అందుకు మొండి బకాయిల వసూళ్లు తప్పనిసరిగా జరగాలని కమిషనర్ స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్ర మొండి బకాయిదారుల జాబితా సిద్ధం చేసి, వారి ఆస్తుల సీజ్, జప్తుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, ఆర్‌ఓ జునైద్ ఒక బృందంగా, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్‌ఓ స్వర్ణలత మరో బృందంగా, కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓ వాజీద్ ఇంకో బృందంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ బృందాలకు ఆర్‌ఐలు, ఏఆర్‌ఐలు, అడ్మిన్‌లు సహాయకులుగా ఉండాలని సూచించారు. ప్రతి బృందం ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున రోజుకు మొత్తం పన్నెండు ఆస్తులను సీజ్ చేసి, జప్తు ప్రక్రియను కొనసాగించాలని కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఈ రమణమూర్తి, రెవెన్యూ అధికారులు జునైద్, వాజీద్, ఎం‌హెచ్‌ఓ నాగప్రసాద్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ మంజూర్ బాష, ఆర్‌ఐలు, ఏఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆయుష్ శాఖ సమా వేశం
విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి...
By Mobbu Venkatramana 2026-01-27 15:59:56 0 459
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....   ఎంతో ప్రసిద్ధి...
By BABJI DADALA 2025-12-29 12:26:34 0 245
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 154
Andhra Pradesh
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో...
By John Baji 2026-02-03 11:33:37 0 32
Andhra Pradesh
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే ;;
కర్నూలు : డోన్ :  డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా...
By Hari Krishna 2026-01-01 16:14:11 0 115
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com