తాగునీటి ఎద్దడీ ఏర్పడకుండా గా ముందస్తు చర్యలు : మునిసిపల్ కమిషనర్

0
137

కర్నూలు : 

తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు

• నగరపాలక సంస్థ అధికారి పి.విశ్వనాథ్

నగరంలో రానున్న వేసవి కాలంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారి పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అశోక్‌నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

నీటి శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే ఫెర్రిస్ ఆలమ్, లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పూర్తి స్థాయి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శుద్ధి కేంద్రంలోని ఎలక్ట్రికల్ మీటర్లు, స్క్రాబ్ యూనిట్‌ను పరిశీలించి, భద్రతా పరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాక్ నిల్వ పట్టికలు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి, ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. లీకేజీలు, సరఫరా సమయం అంశాలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ పెట్టాలని సూచించారు.

సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 0.15 టీఎంసీ, సుంకేసుల ప్రాజెక్టులో 1.2 టీఎంసీ నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు జలవనరుల శాఖతో సమన్వయంతో ఉండాలని తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టులో 1 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునేలా జలవనరుల శాఖ అధికారులతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ గిరిరాజ్, ఏఈ జనార్ధన్, ఇంచార్జి కేశవ్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS)...
By Sidhu Maroju 2026-05-05 13:04:17 0 130
Telangana
రోడ్ల పై జాగ్రత్త వహించండి... ఆర్. వి. కె
నిన్న వైరా సమీపంలో జరిగిన యాక్సిడెంట్ ఘటన పై శత తారక ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆర్. వి. కె సానుభూతి...
By Krishna Balina 2026-01-17 10:12:30 0 188
Andhra Pradesh
శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-04-11 12:48:44 0 81
Andhra Pradesh
గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది
79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్...
By mahaboob basha 2025-08-16 01:10:48 0 615
Telangana
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|
సికింద్రాబాద్  : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని...
By Sidhu Maroju 2025-12-24 10:13:47 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com