రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది

0
127

.       

రైతుల స‌మ‌స్య‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంది. 

మందడం గ్రామంలో రైతుల భేటీలో సుజనా చౌదరి 

 

కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి రైతుల‌కు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం మంద‌డంలో స్థానిక నాయకుడు మాదల రాజేంద్ర నివాసంలో సుజ‌నా చౌద‌రితో రైతులు భేటీ అయ్యారు... ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని గ్రామాల‌కు చెందిన ప‌లువురు                 

      సుజనా ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు . పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతుల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో అధికారులు అల‌స‌త్వం వ‌హిస్తున్నార‌ని సుజ‌నా చౌద‌రి కి రైతులు తెలిపారు. కొందరు అధికారుల తీరు వల్ల సమస్యలు జటిలం అవుతున్నాయని రైతులు వివరించారు. 29వేల మంది రైతుల‌లో కేవ‌లం రెండు శాతం మంది ఎద‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు స‌రిగా స్పందించ‌క పోవ‌డం వ‌ల్ల అది అంద‌రి రైతుల స‌మస్య‌గా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేగుతోంద‌ని ఆవేద‌నం వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. 2019 నుంచి 24 వ‌ర‌కు రాజ‌ధానిని కాపాడుకోవ‌డంలో చేసిన పోరాటంలో సుజ‌నా చౌద‌రి స‌హ‌కారాన్ని ,ప్ర‌మేయాన్ని రైతులు కొనియాడారు. అధికారుల తీరు వల్ల గతంలో 14 అంశాలకు సంబంధించి సమస్యలుండగా ప్రస్తుతం అవి 20 అంశాలు దాటాయని రైతులు వాపోయారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి రైతుల‌తో ప‌లు అంశాల‌ను చ‌ర్చించారు. కూటమి సర్కారు రైతుల సంస్థలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని సుజ‌నా చౌద‌రి రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. రైతులంతా ఐక్యంగా ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు.. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కాకుండా రైతుల తరపున 4గురు ప్రతినిధులుగా ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మానిటరింగ్ చేసుకోండనీ రైతుల‌కు సుజ‌నా సలహా ఇచ్చారు. సమస్యల అర్జీల స్టేటస్, ట్రాకింగ్ కోసం అవసరమైతే రైతులకు నా తరపున ఒక సాఫ్ట్వేర్ మెకానిజం ను అంద చేస్తానని రైతులకు సుజ‌నా హామీ ఇచ్చారు. . స్తానిక ఎమ్మెల్యే, ఎంపీ పెమ్మసాని, మంత్రి నారాయణ అందరూ సామర్థ్యం ఉన్న నాయకులే కాబ‌ట్టి వారి తో సమన్వయంతో ముందుకు సాగండనీ రైతుల‌కు సూచించారు. అమరావతి రాజధాని గా ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం చట్టం చేస్తుంద‌ని, దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు ప్రాసెస్ లో ఉన్నాయని సుజ‌నా వివ‌రించారు. కూట‌మి స‌ర్కార్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివ్రిద్దికి క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు మాద‌ల శ్రీనివాస్, యుగంధ‌ర్ , ధ‌నేకుల రామారావు, మ‌హిళ‌లు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మేము గోల్ కొట్టడం ఖాయం...హరీష్ రావు
మేము గోల్ కొట్టడం ఖాయం ‎ ‎బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ‎కేసీఆర్ సీఎం అవ్వడం...
By Ponnala Srinivasrao 2026-03-25 11:00:53 0 121
Andhra Pradesh
పుంగునూరు నూతన బైపాస్ మలుపు వద్ద యాక్సిడెంట్ జరిగింది
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద రోడ్డు...
By Kothuru Murali 2025-12-31 05:41:06 0 111
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 80
Telangana
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో...
By MERIGE MALLESH 2026-03-25 09:22:54 0 286
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com