పరిశుద్ధ కార్మికుల భద్రత ప్రాధాన్యాలు !! కమిషనర్

0
168

కర్నూలు : కర్నూలు సిటీ : 

పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• కార్మికులకు 21 రకాల పనిముట్ల అందజేత

నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం బి.క్యాంపు శానిటేషన్ స్టోర్‌ వద్ద రూ.82 లక్షల వ్యయంతో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన 21 రకాల రక్షణ సామగ్రి, పనిముట్లను అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ కఠిన పరిస్థితుల్లో శ్రమిస్తున్నారని, వారి భద్రత, ఆరోగ్య రక్షణ నగరపాలక సంస్థకు అత్యంత ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు. సరైన పనిముట్లు, రక్షణ సామగ్రి అందుబాటులో ఉంటే పని సామర్థ్యం పెరుగుతుందని, వ్యాధుల నివారణతో పాటు నగరంలో పరిశుభ్రత ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. రూ.82 లక్షలతో 21 రకాల పనిముట్లు కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 49 పుష్ కార్ట్‌లు, ఎప్రాన్‌లు, మాస్కులు, చేతి గ్లౌజులు, రెయిన్ కోట్లు, చెత్త డబ్బాలు, టబ్‌లు, గడ్డ పారలు, చిన్న సైజు ఇనుప రేకులు, రేకు బొంగులు, పిక్ యాక్స్, కొడవళ్లు, సాలికలు, ట్రాక్టర్ కప్పేందుకు నెట్లు, పెద్ద సైజు పంజాలు, గొడ్డళ్లు, టాయిలెట్ బ్రష్‌లు, నాఫ్తలిన్ బంతులు వంటి మొత్తం 21 రకాల పనిముట్లు కలిపి 39,809 పనిముట్లు పారిశుద్ధ్య కార్మికులకు అందజేసినట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు: పవన్ కల్యాణ్.
Pawan Kalyan: నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు: పవన్ కల్యాణ్ 30-01-2026 Fri 20:25 |...
By Pagadala Venkateswar 2026-01-31 06:14:12 0 129
Telangana
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్‌ జిల్లా నెహెరునగర్‌లో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ ఇమ్రాన్‌ అధ్వర్యంలో...
By Sadaq Sadaq 2026-03-06 17:29:50 0 138
Telangana
బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని,...
By Sidhu Maroju 2026-03-28 06:16:08 0 135
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 605
Andhra Pradesh
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన షేక్ షాహినాజ్
అమరావతి…   ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం...
By Rajini Kumari 2026-01-22 12:05:59 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com