పరిశుద్ధ కార్మికుల భద్రత ప్రాధాన్యాలు !! కమిషనర్

0
202

కర్నూలు : కర్నూలు సిటీ : 

పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• కార్మికులకు 21 రకాల పనిముట్ల అందజేత

నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం బి.క్యాంపు శానిటేషన్ స్టోర్‌ వద్ద రూ.82 లక్షల వ్యయంతో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన 21 రకాల రక్షణ సామగ్రి, పనిముట్లను అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ కఠిన పరిస్థితుల్లో శ్రమిస్తున్నారని, వారి భద్రత, ఆరోగ్య రక్షణ నగరపాలక సంస్థకు అత్యంత ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు. సరైన పనిముట్లు, రక్షణ సామగ్రి అందుబాటులో ఉంటే పని సామర్థ్యం పెరుగుతుందని, వ్యాధుల నివారణతో పాటు నగరంలో పరిశుభ్రత ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. రూ.82 లక్షలతో 21 రకాల పనిముట్లు కొనుగోలు చేసి కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 49 పుష్ కార్ట్‌లు, ఎప్రాన్‌లు, మాస్కులు, చేతి గ్లౌజులు, రెయిన్ కోట్లు, చెత్త డబ్బాలు, టబ్‌లు, గడ్డ పారలు, చిన్న సైజు ఇనుప రేకులు, రేకు బొంగులు, పిక్ యాక్స్, కొడవళ్లు, సాలికలు, ట్రాక్టర్ కప్పేందుకు నెట్లు, పెద్ద సైజు పంజాలు, గొడ్డళ్లు, టాయిలెట్ బ్రష్‌లు, నాఫ్తలిన్ బంతులు వంటి మొత్తం 21 రకాల పనిముట్లు కలిపి 39,809 పనిముట్లు పారిశుద్ధ్య కార్మికులకు అందజేసినట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కోసం టెండర్స్
*ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్స్*    ఫ్యూచర్ సిటీ నుంచి...
By Rajini Kumari 2025-12-31 10:22:16 0 199
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ...
By Kothuru Murali 2026-02-14 07:51:48 0 150
SURAKSHA
Shri Kamlesh Kumar Pant: Architect of Progressive Governance
A distinguished 1993-batch Himachal Pradesh cadre IAS officer, Shri Kamlesh Kumar Pant has led...
By Lokeshwari Panthadi 2026-07-20 05:43:21 0 42
Telangana
వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై...
By Avunoori Mahesh 2026-04-15 11:02:33 0 212
Health & Fitness
శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంటే చలి తక్కువ వేస్తుందా? మజిల్స్ ఉంటే చలి వేయదా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?
శీతాకాలంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు ప్రధాన సమస్య.   ఇది తరచూ రైళ్లు, విమానాలు, రోడ్లపై...
By SivaNagendra Annapareddy 2025-12-18 22:22:22 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com