సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం

0
131

జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహా జాతర తొలి ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే *మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజలు* నిర్వహించారు. అలాగే *కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు ప్రత్యేక పూజలు* చేశారు. వనదేవతల ఆలయాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. గుడి శుద్ధి అనంతరం ఆడపడుచులు అడవి నుంచి సేకరించిన పవిత్రమైన పుట్టమన్నుతో ఆలయ ప్రాంగణాలను పూజారులు అలికారు. రంగురంగుల ముగ్గులతో అలం కరించారు. ఆదివాసీల ఆచారాల ప్రకారం.. ఈ 'గుడిమెలిగే' కార్యక్రమం పూర్తయినప్పటి నుంచే మేడారం ప్రాంతంలో పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో జాతర పనులు వేగవంతం అవుతాయి. 15 రోజుల తర్వాత జరిగే మహాజాతర కోసం ఇప్పటికే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేభక్తుల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Search
Categories
Read More
Telangana
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.   ఈనెల 28 నుండి...
By Sidhu Maroju 2026-01-05 12:43:17 0 127
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 116
Telangana
నిజామాబాద్: పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకురవాలి .అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
అడ్వికేట్‌ప్రోటక్ మాధిరి గానే పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకూ రావల్సినా అవసారం ఎంతైనా...
By Sadaq Sadaq 2026-03-30 18:19:45 0 89
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
By Kothuru Murali 2026-01-20 14:21:58 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com