సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం

0
79

జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహా జాతర తొలి ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే *మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజలు* నిర్వహించారు. అలాగే *కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు ప్రత్యేక పూజలు* చేశారు. వనదేవతల ఆలయాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. గుడి శుద్ధి అనంతరం ఆడపడుచులు అడవి నుంచి సేకరించిన పవిత్రమైన పుట్టమన్నుతో ఆలయ ప్రాంగణాలను పూజారులు అలికారు. రంగురంగుల ముగ్గులతో అలం కరించారు. ఆదివాసీల ఆచారాల ప్రకారం.. ఈ 'గుడిమెలిగే' కార్యక్రమం పూర్తయినప్పటి నుంచే మేడారం ప్రాంతంలో పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో జాతర పనులు వేగవంతం అవుతాయి. 15 రోజుల తర్వాత జరిగే మహాజాతర కోసం ఇప్పటికే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేభక్తుల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*
*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01...
By CM_ Krishna 2025-12-25 02:04:43 0 141
Andhra Pradesh
గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్
గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు...
By John Baji 2025-12-24 16:04:51 0 118
Andhra Pradesh
అన్నమయ్య: మహిళపై కొడవలితో దాడి – పరిస్థితి విషమం.
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం, బోయకొండ యానాదిపాలెం గ్రామానికి చెందిన లేట్ పాపిరెడ్డి భార్య...
By Pagadala Venkateswar 2026-02-04 07:16:18 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com