సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం

0
202

జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహా జాతర తొలి ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే *మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజలు* నిర్వహించారు. అలాగే *కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు ప్రత్యేక పూజలు* చేశారు. వనదేవతల ఆలయాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. గుడి శుద్ధి అనంతరం ఆడపడుచులు అడవి నుంచి సేకరించిన పవిత్రమైన పుట్టమన్నుతో ఆలయ ప్రాంగణాలను పూజారులు అలికారు. రంగురంగుల ముగ్గులతో అలం కరించారు. ఆదివాసీల ఆచారాల ప్రకారం.. ఈ 'గుడిమెలిగే' కార్యక్రమం పూర్తయినప్పటి నుంచే మేడారం ప్రాంతంలో పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో జాతర పనులు వేగవంతం అవుతాయి. 15 రోజుల తర్వాత జరిగే మహాజాతర కోసం ఇప్పటికే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేభక్తుల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Search
Categories
Read More
Rajasthan
Renewable Energy Projects and Solar Power Growth Drive
Renewable energy projects and solar power development are playing a crucial role in promoting...
By Fathima Safa 2026-06-23 09:17:41 0 109
Andhra Pradesh
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.
మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో...
By Pagadala Venkateswar 2026-06-10 05:19:15 0 67
Andhra Pradesh
పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు
మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-07 04:47:24 0 139
Andhra Pradesh
పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ
*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*   *20 మందికి ఉచిత ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల...
By Rajini Kumari 2025-12-21 12:08:06 0 231
Telangana
ఇంటింటికీ ఎస్‌ఐఆర్.|
"వాసవీనగర్ తదితర కాలనీల్లో ఫారాల పంపిణీని పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి." మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-30 08:00:40 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com