భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్

0
127

*భోగి పర్వదినం* సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం (14-01-2026) నియోజకవర్గ సమన్వయకర్త *దేవినేని అవినాష్* ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా భోగి మంటలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రైవేటికరణ జి.వోను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ 17 వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామి రెడ్డి, మాజీ కార్పొరేటర్, వైసీపీ రాష్ట్ర నాగవంశం విభాగం అధ్యక్షుడు బొడ్డు అప్పల నాయుడు, వివిధ హోదాల నాయకులు, మహిళ నాయకురాలు అందరు కలసి *దేవినేని అవినాష్* గారికి భోగి శుభాకాంక్షలు💐 తెలియజేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *అప్పల నాయుడు* మాట్లాడుతూ సూర్య భగవానుడు ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి ఇంట భోగి భోగభాగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.
Andhra   YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP జగన్ పై...
By Pagadala Venkateswar 2026-03-09 05:49:57 0 81
Business EDGE
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 6K
Andhra Pradesh
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ...
By Kola Kirankumar 2026-03-27 12:02:07 0 174
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com