భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్

0
79

*భోగి పర్వదినం* సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో బుధవారం (14-01-2026) నియోజకవర్గ సమన్వయకర్త *దేవినేని అవినాష్* ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా భోగి మంటలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రైవేటికరణ జి.వోను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ 17 వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామి రెడ్డి, మాజీ కార్పొరేటర్, వైసీపీ రాష్ట్ర నాగవంశం విభాగం అధ్యక్షుడు బొడ్డు అప్పల నాయుడు, వివిధ హోదాల నాయకులు, మహిళ నాయకురాలు అందరు కలసి *దేవినేని అవినాష్* గారికి భోగి శుభాకాంక్షలు💐 తెలియజేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *అప్పల నాయుడు* మాట్లాడుతూ సూర్య భగవానుడు ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి ఇంట భోగి భోగభాగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government...
By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 1K
Telangana
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
By Bittu Bittu 2026-02-04 13:51:21 0 157
Andhra Pradesh
ప్రజలు డిసెంబర్ 31 ఆంక్షలు పాటించాలని సిఐ గారి విన్నపం గారి విన్నపం
ఆంక్షలు పాటించాలని అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో...
By Kothuru Murali 2025-12-30 12:53:07 0 80
Telangana
మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.
మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల...
By Gangaram Rangagowni 2026-01-19 10:43:13 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com