త్వరలో గరుడ పథకం ఏపీలో.

0
135

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. పేద బ్రాహ్మణుల సంక్షేమం, వారికి అండగా నిలిచేందుకు ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే.. సంబంధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నారు. వీటికి నేరుగా అకౌంట్లో జమ చేయనున్నారు. కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే గరుడ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా మొదలైంది. తాజాగా అమరావతిలోని సచివాలయంలో ఈ పథకం విధివిధానాలు, అమలుపై మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ సమావేశమై చర్చించారు. పథకం ఎలా అమలు చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-12 11:10:36 0 214
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 121
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త!* 🎉 న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-24 14:15:42 0 193
Telangana
వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
  *వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్* మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల...
By Bittu Bittu 2025-12-13 13:09:25 0 326
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com