సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన

1
567

సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన

 


బాపట్ల: బాపట్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోమవారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్‌లో నారావారిపల్లె వెళ్తున్న క్రమంలో తీర ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిని వారు నిశితంగా పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రూ. 97 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో బీచ్ పరిసరాలను పర్యాటక స్వర్గధామంగా మార్చే పనులు వేగవంతం అయ్యాయి. సూర్యలంకను కేవలం విహార కేంద్రంగానే కాకుండా, బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలతో కూడిన గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. తీర ప్రాంత పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఓటు హక్కు పరిరక్షణకు క్షేత్రస్థాయిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్లో స్వయంగా SIR ఫారమ్ నింపిన ఎంపీ
 బెల్లంపల్లి : ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే...
By Avunoori Mahesh 2026-07-11 11:30:24 0 137
SURAKSHA
AI Cameras Drones Make Tamil Nadu Roads Safer for All DriversSafeRoads
: Tamil Nadu Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-02 05:06:15 0 164
Andhra Pradesh
ప్రశాంతంగా పది పరీక్షలు
ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు...
By Shyamala Yadagiri 2026-03-16 14:17:16 0 291
Business & Finance
Monsoon Boost Expected for Uttar Pradesh's Farm Economy
The southwest monsoon has officially arrived in Uttar Pradesh, bringing widespread rainfall and...
By Navya Sree 2026-07-01 06:03:51 0 78
Andhra Pradesh
పుంగనూరు: యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కేసు నమోదు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఉబేదుల్లా కాంపౌండ్ లోని ఓ చింతకాయ గోడౌన్ లో మహమ్మద్ సాద్ (20)...
By Kothuru Murali 2026-01-14 08:49:45 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com