ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|

0
217

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా భద్రతను పర్యవేక్షించడం సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు "నేను సైతం" మరియు "కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు" కింద స్థానిక వ్యాపారులు నివాసితుల సహకారంతో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి అనేక నేరాలలో సహాయపడతాయి.

సున్నిత ప్రాంతమైన, మచ్చ బొల్లారం మార్కెట్ ప్రధాన రహదారులు, వాణిజ్య సముదాయాలు ఉండే జంక్షన్ లు, మరియు అంతర్గత కాలనీ ఎంట్రీ పాయింట్ల వద్ద 8 కెమెరాలను  బిగించారు. వీటి ద్వారా లభించే ఫీడ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లేదా కమాండ్ సెంటర్ కు అనుసంధానించడం ద్వారా పోలీసులు నిరంతర నిఘా ఉంచుతున్నారు. 

ఈ నిఘా కెమెరాలను అల్వాల్ ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో  సమానం. మీలాగే అందరూ కాలనీవాసులు స్ఫూర్తి పొంది సీసీ కెమెరాలు నియమించుకోవడం వల్ల నేరాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఒకవేళ నేరాలు జరిగితే నేరస్తులను గుర్తించడంలో  సీసీ కెమెరాలు ఎంతో సహాయం చేస్తాయన్నారు. ఈ సీసీ కెమెరాలను సమకూర్చిన కాలనీవాసులను ఎస్ హెచ్ ఓ అభినందించారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, సబ్ ఇన్స్పెక్టర్ దేవేందర్, టెక్నికల్ టీం,  పిఎస్ సిబ్బంది, మరియూ కాలనీ వాసులు పాల్గొన్నారు.

నిఘా కెమెరా ఉంటే, నేరస్థుడికి భయం ఉంటుంది. అనే నినాదంతో అల్వాల్ ల్లో జరుగుతున్న ఈ ప్రక్రియతో స్థానికులలో భద్రతాభావం పెరుగుతుంది. 

మీ మీ ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోతే స్థానిక పోలీసుల సూచన మేరకు వాటిని ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. 

#sidhumaroju

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే
మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-01 12:11:56 0 230
Telangana
జాతీయ ఓటరు దినోత్సవ... నా భారత్ నా ఓటు అనే నినాదం... కలెక్టర్ రాహుల్ రాజ్.
 మెదక్ జిల్లా కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో “నా భారత్ - నా ఓటు” అనే...
By Gangaram Rangagowni 2026-01-23 09:40:58 0 344
Andhra Pradesh
మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి...
By Pagadala Venkateswar 2026-04-06 04:20:53 0 120
Telangana
నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో...
By Sidhu Maroju 2025-06-15 11:43:54 0 1K
Telangana
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-04-28 04:38:41 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com