స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము

0
179

*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఎన్జీవోస్ అసోసియేషన్...2026క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము*

 

*విజన్ ఉన్న నాయకుడు సీఎం అయితే... రాష్ట్రానికి, ప్రజలకు ఎంత మంచి చేయచ్చో చంద్రబాబు చూపిస్తున్నారు*

 

*గుడివాడ అభివృద్ధికి....అందరం కలిసి ముందుకు సాగుదాం*

 

గుడివాడ జనవరి 12:సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ దిశగా సాగుతున్న రాష్ట్రానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు అండగా నిలవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ అభివృద్ధి కోసం అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామన్నారు.

 

 ఎన్జీవో అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం ఉదయం ఆవిష్కరించారు. 

 

ఈ సందర్భంగా ఎన్జీవో నేతలతో కొద్దిసేపు ఎమ్మెల్యే రాము మాట్లాడారు.... గుడివాడలో అభివృద్ధి పనుల పై ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యేతో ఉద్యోగులు అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని, ఐక్యంగా ముందుకు సాగుతూ

 

 ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మంచి కోసం ఉద్యోగ వర్గాలు చేసే అన్ని కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందనీ ఉద్యోగులతో ఎమ్మెల్యే రాము అన్నారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ...పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఐదేళ్ల వైసీపీ పాలనకు స్వస్తి చెప్పి కూటమి పార్టీలకు పట్టం కట్టడంతో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రుణపడి ఉంటుందన్నారు.

 

 అయితే ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు జరిగిన పొరపాటు సరిదిద్దు కున్నారన్నారు. పరిపాలన అనుభవం, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే... రాష్ట్రానికి ప్రజలకు ఎంత మంచి చేయచ్చో చంద్రబాబు 19 నెలల కాలంలో ప్రత్యక్షంగా చూపించారన్నారు. కూటమిలో భాగస్వామైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సహకారం, దేశప్రధాని నరేంద్రమోడి తోడ్పాటుతో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘటించారు.

 

ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షులు కేపీ రావు, ప్రధాన కార్యదర్శి జి. రాజేంద్రప్రసాద్, అసోసియేషన్ నాయకులు పి వి ఆర్ వి ప్రసాద్, బివై విష్ణు ప్రసాద్, ఎం విద్యావతి, కే మహేష్, ఎంవి శ్రీనివాస్, డి జ్వాలా కిరణ్, డి విక్టర్ బాబు, పాపయ్య, వెంకటాద్రి,మనోజ్,రాము,రమేష్ బాబు, కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, పలువురు ఎన్జీవో నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు  రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
By Chennaiah Kati 2026-07-03 16:58:11 0 56
Telangana
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ పాల్ .|
హైదరాబాద్ : 2024తో పోలిస్తే 25లో 2 శాతం తగ్గిన ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు. మరోవైపు దేశంలోని ప్రధాన...
By Sidhu Maroju 2026-01-05 09:37:05 0 201
Andhra Pradesh
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  ఉదయం :...
By Chennaiah Kati 2026-07-06 01:09:56 0 59
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Andhra Pradesh
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-28 06:07:27 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com