ఉచిత క్యాన్సర్స్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే !!

0
126

కర్నూలు: నంద్యాల : డోన్

ఈ రోజు డోన్ పట్టణంలోని క్లబ్ హౌస్ ప్రాంగణంలో డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ గారి సహకారంతో,బసవతారక్ ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ (స్క్రీనింగ్) శిబిరం ప్రారంభోత్సవ  కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణలో బసవతారక్ ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. బాసర తరహాలో తిరుపతిలో అక్షరాభ్యాసం సౌకర్యం.
వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం 'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం...
By Pagadala Venkateswar 2026-03-13 07:31:36 0 110
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 73
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అకాల వర్షానికి నేలకొరిగిన బీరపంట
చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీరపంటకు తీవ్ర నష్టం కలిగించింది. ఖాన్ సాబ్...
By Kothuru Murali 2026-03-20 06:15:29 0 90
Andhra Pradesh
నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి
కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్...
By mahaboob basha 2025-07-16 15:17:32 0 986
Andhra Pradesh
మదనపల్లెలో నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం.
మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-18 06:22:29 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com