నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్

0
18

నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్

గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 18న నమోదైన నకిలీ కరెన్సీ నోట్ల కేసును టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫిరంగిపురం సీఐ భుజంగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టి ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వాళపాడు గ్రామానికి చెందిన గంధం రామాంజనేయులు (37), గుంటూరు నిరుపేదలపేటకు చెందిన ఓర్సు వెంకట రాములు (42), ఓర్సు బాలకృష్ణ (25)లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది.

నిందితుల వద్ద నుంచి రూ.500 విలువ కలిగిన 53 నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ నోట్లు తయారీకి ఉపయోగించే ప్రాథమిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితులను నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లా పోలీసులు నకిలీ కరెన్సీ చలామణి, తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిరంతరం నిఘా ఉంచి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Business & Finance
Fuel Prices Remain Stable in Kolkata
Petrol and diesel prices in Kolkata remained unchanged on 29 June, providing relief to transport...
By Navya Sree 2026-06-29 07:10:26 0 74
SURAKSHA
విపత్తుల్లో పోలీస్ స్పందన: మానవత్వానికి మారుపేరు
విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించడంలో పోలీసులు ముందుంటారు....
By Kalaga Sailaja 2026-06-26 05:35:18 0 38
SURAKSHA
Anand Mohan, IPS: Leading with Courage and Commitment
The Journey begins Strong leadership in policing is defined by integrity,...
By Fathima Safa 2026-07-22 09:51:26 0 17
Andhra Pradesh
మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన...
By Ratna Sekhar 2026-03-11 07:07:27 0 365
Telangana
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
By G k Nookala 2026-04-26 11:01:53 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com