కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

0
188

కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం

–3వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

+++++

 

         కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్థి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.  

 

   శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్‌ సీతారామ నగర్‌ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు.  

 

 

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో చతికిల పడిన రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్థి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తనకున్న రాజకీయ అనుభవం, సమర్థత, పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్థి చేస్తూ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ఒక వైపు రాష్ట్రాన్ని అభివృద్థి చేస్తూనే సూపర్‌ సిక్స్‌ పేరుతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తోడుగా విద్యుత్‌ ఛార్జీలు తగ్గింపు, జీఎస్టీలో సంస్కరణ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పేదలపై ఆర్థిక భారాలను తగ్గించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

    ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడి బాబూరావు, గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్, బండి సాయి కోమలి, గుంజు ఏసు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా బిజెపిలో చేరికలు.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ...
By Sidhu Maroju 2026-01-31 09:02:14 0 182
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 42
Telangana
గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!
బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన.... భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం ఖానాపురం...
By Gujile Ramu 2026-05-15 06:18:04 0 104
Andhra Pradesh
చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్
**చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్*   *త్రాగునీటి కొరత రాకుండా...
By Rajini Kumari 2026-06-01 12:27:27 0 144
Haryana
Haryana Accelerates Employment and Economic Growth
Haryana continues to strengthen its position as one of India's fastest-growing economies through...
By Fathima Safa 2026-06-30 12:27:57 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com