గుంటూరు లాలాపేట మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్లలో మాదకద్రవ్యాలు పట్టివేత.

0
619

Kvsr. Koteswararao. Guntur

 

*గుంటూరు జిల్లా పోలీస్...* *కొత్తపేట పోలీస్ స్టేషన్* *ది: 09.01.2026* _*//100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు,.//*_ 🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. 📍 ఈ క్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ Sk.అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల కార్యకలాపాలను నిరోధించేందుకు కొత్తపేట సీఐ శ్రీ ఎం. వీరయ్య చౌదరి గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍 నిన్న రాత్రి కొత్తపేట ఎస్‌ఐ శ్రీ ఎన్. రవికిరణ్ రెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది (PCs డేగల కోటేశ్వరరావు, వి. జానీ భాష, టి. అనిల్ కుమార్, చ. శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఆర్ కోటేశ్వరరావు) నెహ్రూ నగర్, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో గంజాయి మరియు MDMA డ్రగ్స్ అమ్ముతూ, సేవిస్తున్నారనే సమాచారం మేరకు రైడ్ నిర్వహించారు. 📍 రైడ్‌లో భాగంగా నెహ్రూ నగర్‌కు చెందిన పఠాన్ మున్నా మరియు చిల్లర ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద 100 గ్రాముల లిక్విడ్ గంజాయి మరియు 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. 📍 అరెస్ట్ చేసిన నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారు ఇద్దరికీ 14 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. 📍 కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను అమ్మినా, సేవించినా, సరఫరా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ శ్రీ స్కె. అబ్దుల్ అజీజ్ గారు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 290
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.
శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో...
By Pagadala Venkateswar 2026-06-06 05:45:29 0 80
Andhra Pradesh
అంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ఐక్యతే మార్గం: ముఫ్తీ అబ్దుల్ బాసిత్.
గుంటూరు:అంజుమన్ ఇస్లామియా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమీయతుల్ ఉలమా రాష్ట్ర...
By John Baji 2026-01-06 12:38:30 0 210
Andhra Pradesh
జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వార్షికోత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు
*హైదరాబాద్*   • జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను...
By Rajini Kumari 2025-12-28 10:17:21 0 184
Telangana
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...
By Ellandula Sandeep 2026-01-12 17:44:18 0 511
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com