బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు

0
273

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు

 

బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యలంక బీచ్ ని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న పనులపై ఆయన ఆరా తీశారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిర్మాణాలకు కేటాయించిన స్థలమును మ్యాప్ ద్వారా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు వేగంగా ఒకదాని వెంట ఒకటి జరగాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సూర్యలంక బీచ్ లో చేపట్టిన పనులన్నీ సెప్టెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని, పనుల పురోగతికి సంబంధించి వారం వారం నివేదికను అందజేయాలని ఆయన పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల తహసిల్దార్ సలీమా, బాపట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, మండల ఎంపీడీవో, సర్వేయర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్ర్గం: అవగాహన సకాలంలో గుర్తించకపోతే చూపు కోల్పోతారు
అన్నమయ్య జిల్లా సోమల మండలం పొదలగుంట్లపల్లిలో గురువారం గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ...
By Kothuru Murali 2026-03-13 07:59:45 0 92
Andhra Pradesh
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3  ఏపీఎస్ఆర్ఎం స్కూల్   కృష్ణలంక      స్వచ్ఛంద...
By Rajini Kumari 2025-12-20 13:38:50 0 137
Andhra Pradesh
Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-01-25 06:25:53 0 101
Andhra Pradesh
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.
    Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన...
By Pagadala Venkateswar 2026-02-11 09:16:42 0 79
Telangana
Peddapalli : పెట్రోల్ టెన్షన్ వద్దు.. స్టాక్ ఫుల్: పౌరసరఫరాల శాఖ
Peddapalli 
By Sunka Santhosh 2026-03-25 09:55:20 0 184
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com