గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.

0
162

గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.

 

బాపట్ల : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని “వికసిత్ భారత్–జి రామ్ జి”గా పేరు మార్చిన నేపథ్యంలో గ్రామ సభలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ఈ పథకంపై రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను కలెక్టర్ గారు విడుదల చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, పెండింగ్‌లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఐజీఓటీ శిక్షణలను అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితా దరఖాస్తులు, రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు, ఆర్మీ ఫ్లాగ్‌డే విరాళాల సేకరణలో వేగం పెంచాలని సూచించారు.

* వ్యవసాయ, వ్యవసాయేతర పంటలకు బ్యాంకుల నుంచి మంజూరయ్యే రుణాలను 10 శాతం పెంచాలని జిల్లాస్థాయి కమిటీ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ డా||వి. వినోద్ కుమార్,  ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా రైతుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
* ధాన్యం, పొగాకు సహా 198 రకాల పంటల పెట్టుబడి రుణాలు పెంచేందుకు కమిటీ ఆమోదం తెలిపిందని, పొగాకు పంటకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. పాడి, మత్స్య, పశుపోషణ రంగాల అభివృద్ధిపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
* జిల్లా కమిటీ తీర్మానాలను రాష్ట్రస్థాయి కమిటీకి ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన
చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:25:12 0 119
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 86
Tamilnadu
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
By Bharat Aawaz 2026-02-23 07:48:34 0 246
Andhra Pradesh
AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు.
  AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు...
By Pagadala Venkateswar 2026-03-10 04:45:41 0 84
Andhra Pradesh
బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు నందు కరస్పాండెంట్ యస్.షాషావలి ఆధ్వర్యంలో
గూడూరు నందు కరస్పాండెంట్ యస్.షాషావలి ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం...
By mahaboob basha 2025-11-14 14:44:11 0 184
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com