సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ ఐ పి బి సమావేశం

0
203

*అమరావతి*

 

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం.

 

వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు.

 

గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ.

 

పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను ఆమోదించనున్న 14వ ఎస్ఐపీబీ సమావేశం.

 

2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని... అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని సూచించిన చంద్రబాబు.

 

రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారంటూ సీఎం చంద్రబాబు కితాబు.

 

14వ ఎస్ఐపీబీ సమావేశానికి హాజరైన మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు.

 

*ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...*

 

• 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు.

• గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది.

• రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.

• భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి.

• టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.

• ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి.

• 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశాం... ఫలితాలు వచ్చాయి.

• విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం.

• *13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం.*

• *రూ. 4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం.*

• *విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.*

• *2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.*

• *ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.*

• విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి.

• విద్యుత్ రంగంతోపాటు... వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి.

• దావోస్ సదస్సుకు వెళ్లాం ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం... విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం.

• గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారు.

• సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది... ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి

• స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలి.

Search
Categories
Read More
Telangana
శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో...
By Sriramula Anil 2026-06-21 14:28:37 0 249
Telangana
ఆసిఫాబాద్ జ్యోతిబాఫులే పాఠశాలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ
ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను...
By Chunarkar Jagadeesh 2026-07-02 14:38:21 0 191
SURAKSHA
C. Lalsawivunga, IAS: Driving Progress Through Governance
The Journey begins "The strength of a nation lies not only in its policies but...
By Fathima Safa 2026-07-21 11:14:40 0 38
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలువురి రౌడీషీటర్ల బైండోవర్.|
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్....
By Sidhu Maroju 2025-10-27 15:38:21 0 278
Andhra Pradesh
పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలపై బాధితుల ఆరోపణలు.
మదనపల్లె మండలం కోళ్లబైలు కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకుల పేరు...
By Pagadala Venkateswar 2026-06-08 15:43:29 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com