పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌

0
185

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. సీఎం ఈనెల 7న పోలవరం పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద పర్యటన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ప్రతాప్‌ శివ కిశోర్‌తో కలిసి కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు. అనం తరం ప్రాజెక్టు సమావేశపు మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ సీఎం డయా ఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను, గ్యాప్‌ 1,2 ప్రాంతాలను, వైబ్రో కాంపాక్షన్‌ పనులను పరిశీలిస్తార న్నారు. పనుల ప్రగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను నోడల్‌ అధికారులగా నియమిం చినట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో రమణ, ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మేఘా నిర్మాణ సంస్థ ప్రతినిధులు గంగాధర్‌, మురళి పమ్మి, జల వనరులశాఖ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.
మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక...
By Pagadala Venkateswar 2026-02-17 11:41:09 0 119
Andhra Pradesh
బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన అధికారులు
సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు...
By Boiena Rajesh 2026-04-09 01:17:22 0 131
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
By Kothuru Murali 2026-02-14 14:40:34 0 117
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రొంపిచర్ల పెను ప్రమాదం
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పీలేరుకు...
By Kothuru Murali 2026-05-21 16:48:16 0 26
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com