కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్

0
288

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురైన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ నాయకురాలు డాక్టర్ అనూష యాదవ్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే పనిలో నిమగ్నం అవ్వడం వలన బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో! అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు తను అన్ని విధాల అండగా ఉంటానని అనూష యాదవ్ అన్నారు. 

 

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ బాధితుడే స్వయంగా ఫోన్లో వివరించగా, బాధిత కుటుంబానికి తోడుగా ఉంటానని అవసరమైన సందర్భంలో కత్తిపూడి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు పాల్గొన్నారు.. #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ఉల్లి పంట సాగు చేసి పండించిన రైతు కు కన్నీరే మిగిలింది. ఇది మన గూడూరులో చోటు చేసుకుంది
భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి . గత...
By mahaboob basha 2025-08-15 00:56:15 0 628
Andhra Pradesh
జారి పడుతున్న బండ రాళ్లు ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు
*జారిపడుతోన్న బండరాళ్లు*   *-ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు మార్గం*  ...
By Rajini Kumari 2025-12-24 07:54:24 0 188
Andhra Pradesh
యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
బాపట్ల జిల్లా: యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-27 16:15:04 0 159
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com