శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర : ఎమ్మిగనూరు

0
214

కర్నూలు :  ఎమ్మిగనూరు : 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో  శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర (రథోత్సవం) సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు పట్టణంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా నూతన వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన లైటింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రాంతాలు:
• శ్రీనివాస్ సర్కిల్ – SBI – ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు
• సోమేశ్వర సర్కిల్
• మాచాని సోమప్ప సర్కిల్
• అంబేద్కర్ & గాంధీ సర్కిల్
• కర్నూలు బైపాస్ రోడ్డు – నూతన సర్కిల్
• శివ సర్కిల్
• బస్ స్టాండ్ పరిసరాలు
• అన్నమయ్య సర్కిల్

వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చే జాతర సందర్భంగా భద్రత, వెలుతురు, రాకపోకలు సజావుగా ఉండేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. జాతరను శాంతియుతంగా, ఘనంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
By Sidhu Maroju 2025-09-26 18:04:24 0 307
Andhra Pradesh
5 జి ఫోన్లు పంపిణీ !!
కర్నూలు : కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  అంగన్వాడీ టీచర్లకు శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను...
By Hari Krishna 2025-12-15 15:15:29 0 210
Andhra Pradesh
మదనపల్లెలో: భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై పైశాచిక దాడి.
మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై...
By Pagadala Venkateswar 2026-04-08 13:54:38 0 94
Andhra Pradesh
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం మహిళలపై నేరాల...
By Pagadala Venkateswar 2026-03-13 07:34:20 0 125
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com