ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం !!

0
235

కర్నూలు... ఆధ్యాత్మిక ప్రవచనాలతోనే యువతకు మార్గదర్శనం- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ 

నేటి పోటీ ప్రపంచంలో తప్పుదారి పడుతున్నటువంటి యువతను సన్మార్గంలోకి తీసుకురావడానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు మార్గదర్శకంగా నిలుస్తాయని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. 
స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి 403 వ శ్రీ మద్ భాగవత సప్తాహం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలకు, యువతకు చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక అలవాట్లు నేర్పించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారమవుతమన్నారు. ఎక్కువ చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు 60 ఏళ్లు పైబడిన వారు వస్తుంటారని అటువంటి వారి కన్నా యువత ఎక్కువగా ఇటువంటి ప్రవచనాలు వినడానికి వస్తే వారి జ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పద్మాకర్ స్వామి వారు కర్నూలుకు రావడం కర్నూలు నేల అదృష్టమని, ఆయన శిష్యులు ఎంతోమంది శిధిలావస్థకు చేరుకున్న ఆలయాలను జీర్ణోదరణ చేశారన్నారు. అటువంటి కార్యక్రమం ఎవరు చేసినా తన వంతు సహకారం అందిస్తానని టీజీ తెలిపారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోదరణకు మనం 25 శాతం నిధులు పెడితే 75% నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. మన ప్రాంతంలో ఎక్కడ జీర్ణోదరణకు అవసరమైన దేవాలయాలను గుర్తిస్తే మంత్రి భరత్ ద్వారా నిధులు విడుదల చేయిస్తానని టీజీ వెంకటేష్ తెలిపారు. అంతేకాకుండా శిధిలాలయాలకు సమకూర్చవలసిన 25 శాతం నిధులు కూడా తాము సొంతంగా భరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానికంగా ఉండే ప్రజలు అటువంటి దేవాలయాలను గుర్తించి సరైన ప్రణాళిక తీసుకుని ముందుకు రావాలని ఆయన కోరారు. స్వామీజీ ప్రవచనాల కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా ఇంత మంది జనం రావడం ప్రజల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం అన్నారు. వారం రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం టీజీ వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, డాక్టర్ వేణుగోపాల్, హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న...
By Sunka Santhosh 2026-06-12 18:41:56 0 109
Andhra Pradesh
కరాటే క్రీడాకారులకు అభినందనలు
కరాటే క్రీడాకారులకు అభినందనలు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాయల్ నకల్స్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్...
By Chennaiah Kati 2026-07-22 15:26:52 0 30
SURAKSHA
Nipun Jindal IAS: A Visionary Administrator Driving Change
From grassroots governance in Himachal Pradesh to shaping India's economic administration, Nipun...
By Kalaga Sailaja 2026-07-21 08:28:10 0 27
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Telangana
" (Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .
అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ...
By Thokala Sivaji 2026-03-30 02:42:22 0 477
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com