సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

0
148

సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

బాపట్ల: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బీచ్ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సూర్యలంక బీచ్‌కు పెరుగుతున్న పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక హంగులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి త్వరతగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో 10 కోట్లు జమ
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్‌కు...
By Rajini Kumari 2026-01-14 12:35:49 0 81
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.
గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు...
By John Baji 2026-01-21 13:32:15 0 102
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 07:02:58 0 62
Andhra Pradesh
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026   *పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-07 12:01:57 0 50
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com