మార్క్ఫెడ్ కందుల కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల ::

0
111

కర్నూలు : నంద్యాల : డోన్ : ప్యాపిలి : 

ఈ రోజు ప్యాపిలి పట్టణంలో NCCF ఆధ్వర్యంలో ఏ.పీ. మార్క్‌ఫెడ్ నిర్వహించిన కందుల కొనుగోలు సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు *శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి* గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. రైతులు పండించిన కందులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ఉద్దేశంగా ఇటువంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
🏭 సిగాచీ ఇండస్ట్రీస్ – ఒక పరిశ్రమ, ఒక విషాదం | పూర్తి వివరాలు
సిగాచీ ఇండస్ట్రీస్ (Sigachi Industries Ltd) అనేది 1989లో స్థాపించబడిన హైదరాబాదులో కేంద్రంగా ఉన్న...
By Bharat Aawaz 2025-07-02 06:33:13 0 1K
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 83
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-16 18:37:59 0 177
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com